IPL 2025: మే 17 నుంచి ఐపీఎల్‌ రీస్టార్ట్.. ఆరు వేదికల్లో మిగిలిన మ్యాచ్‌లు

భారత్, పాకిస్తాన్ మధ్య వివాదం కారణంగా ఇటీవల ఐపీఎల్ ను నిలిపివేశారు. ఇప్పుడు దీనిని రీ షెడ్యూల్ చేశారు. ఈనెల అంటే మే 17 నుంచి పునరుద్ధరించాలని బీసీసీఐ నిర్ణయించింది. రీ షెడ్యూల్ చేసిన దాని ప్రకారం ఐపీఎల్ మే 17 నుంచి ప్రారంభమవుతుంది. ఫైనల్ జూన్ 3న జరగనుంది. మిగిలి ఉన్న 17 మ్యాచ్లను 6 వేదికలలో నిర్వహించనున్నారు.

అందులో బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో, ముంబైలో మిగిలిన లీగ్ మ్యాచ్లను నిర్వహించనున్నారు. అయితే ప్లే ఆఫ్ మ్యాచ్ల వేదికలను ఇంకా ప్రకటించలేదు.. త్వరలో దాని వివరాలను ప్రకటించనున్నారు. ఆగిపోయిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సహా ఇంకా 17 మ్యాచులు ఉన్నాయి.

అందులో రెండు డబ్బులు హెడర్ మ్యాచ్ లు ఉన్నాయి. అంటే రెండు ఆదివారంలో రెండేసి మ్యాచులు జరుగుతాయి. ప్రభుత్వం, భద్రత సంస్థలతో చర్చల అనంతరం బీసీసీఐ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. కాగా ఇందులో క్వాలిఫైయర్ 1 – మే 29న జరుగుతోంది.

అలాగే ది ఎలిమినేటర్ – మే 30న, క్వాలిఫైయర్ 2 – జూన్ 1న, ఫైనల్ – జూన్ 3వ తేదీన జరుగుతాయి. ఈ నాలుగు మ్యాచ్లకు వేదికలను బీసీసీఐ తర్వాత ప్రకటించనుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ మ్యాచ్లను ప్రధాన మెట్రోలు లేదా సురక్షిత తీర ప్రాంత వేదికలలో నిర్వహించవచ్చని భావిస్తున్నారు.

ఈ సందర్భంగా దేశ భద్రతా వ్యవస్థను నడిపించే భారత సాయుధ దళాల ధైర్యం, దృఢ సంకల్పానికి BCCI సెల్యూట్ చేసింది. “భారత సాయుధ దళాల ధైర్యం, అంకితభావానికి మేము వందనం చేస్తున్నాము. దీని కారణంగా క్రికెట్ సురక్షితంగా తిరిగి రావడం సాధ్యమైంది. BCCI జాతీయ ప్రయోజనాలను అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తుంది. అదే స్ఫూర్తితో IPL ను విజయవంతంగా పూర్తి చేయడానికి కట్టుబడి ఉంది” అని బోర్డు తన ప్రకటనలో పేర్కొంది.

తరవాత కథనం