RCB: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే గుడ్ న్యూస్.. ఇక రచ్చ రచ్చే

భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ వారం రోజులు నిలిపివేశారు. మళ్లీ యుద్ధ వాతావరణం తగ్గడంతో మే 17వ తేదీ నుంచి రీస్టార్ట్ చేశారు. రేపటి నుంచి ఈ మిగిలిన మ్యాచ్లు జరుగుతాయి. మొత్తం ఆరు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఫ్రాంచైజీలకు కొన్ని చిక్కులు వచ్చాయి. పలు టీంల విదేశీ ఆటగాళ్లు తమ దేశం వెళ్లిపోయి తిరిగి రావడం లేదు.

దీంతో ఇది పెద్ద దెబ్బ అని చెప్పాలి. అయితే ఆర్ సి బి కి మాత్రం ఎలాంటి చిక్కులు లేవు. అందరు విదేశీ ప్లేయర్లు ఆర్సీబీలో చేరేందుకు తిరిగి వస్తున్నారు. ఒక్క జేకబ్ బెతెల్ మాత్రమే జట్టు లో అందుబాటులో ఉండడని తెలుస్తోంది. మిగతా వారంతా జట్టులోకి చేరిపోతున్నారు. తాజాగా ఆసిస్ స్టార్ పెసర్ జోష్ హేజిల్ వుడ్ తిరిగి ఇండియాకు వచ్చాడు.

నిజానికి హేజిల్ వుడ్ ఐపీఎల్ వాయిదా పడక ముందే తీవ్రంగా గాయపడ్డాడు. అప్పుడే అతడు దూరమవుతాడని అంతా భావించారు. అందులోనూ యుద్ధ వాతావరణంతో తమ దేశం వెళ్లిపోయాడు. మళ్లీ తిరిగి రాడని భావించారు. అలాగే జూన్ 11న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ మ్యాచ్ కూడా ఉండడంతో అతడు ఆర్సిబి జట్టులో దూరం అవ్వడం ఖాయమని అనుకున్నారు.

వాటన్నింటినీ దాటుకుని హేజిల్ వుడ్ ఆర్ సి బి జట్టులో చేరిపోయాడు. అతనితోపాటు దక్షిణాఫ్రికా ప్లేయర్ లుంగీ ఎంగిడి కూడా ఆర్సీబీలో భాగమైపోయాడు. వీరు మాత్రమే కాకుండా మిగతా విదేశీ ఆటగాళ్లు టిమ్ డేవిడ్, ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్ స్టోన్ వంటి స్టార్ ప్లేయర్స్ తిరిగి ఆర్సిబి జట్టులోకి వచ్చేసారు.

అలాగే రోమారియో షెఫర్డ్ కూడా తమ బోర్డును ఒప్పించుకుని జట్టులోకి చేరిపోయాడు. దీంతో విదేశీ ఆటగాళ్లంతా ఐపీఎల్ లీగ్ అయిపోయేంతవరకు అందుబాటులోనే ఉంటారు. ఈ అప్డేట్ తో ఆర్సిబి ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఆర్సిబి తొలి టైటిల్ కల నెరవేరబోతున్నట్లు అర్థమవుతుంది.

తరవాత కథనం