ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో రాజస్తాన్ జట్టు ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. చెన్నైని మట్టిగరిపించి మరో విజయాన్ని కైవసం చేసుకుంది. చెన్నై జట్టు భారీ స్కోరే చేసినా.. ఆర్ఆర్ జట్టు ఓపెనర్ బ్యాటర్లు జైస్వాల్, వైభవ్ చెలరేగడంతో విజయం సొంతమైంది.
దీంతో సీజన్ మొదలైనప్పటి నుంచి పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో ఉన్న చెన్నై.. ఈ మ్యాచ్లో గెలిచి అయినా ముందుకెళ్లాలని ప్రయత్నించింది. కానీ ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్లోనూ ఓడి ఆఖరి స్థానంలోనే ఉండిపోయింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.
సీఎస్కే బ్యాటర్లు ఆయుష్ మాత్రే 43 పరుగులు, డెవాల్డ్ బ్రెవిస్ 42 పరుగులు, శివం దూబె 39 పరుగులతో బాగా రాణించారు. ఇక ఛేజింగ్కు దిగిన ఆర్ఆర్ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశి 57, జైస్వాల్ 36, సంజు శాంసన్ 41 పరుగులు రాబట్టడంతో విజయం ఆర్ఆర్ సొంతమైంది.
ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్ మెరుపులు మెరిపించారు. శివమ్ దూబె సైతం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పేలవ ఫామ్లో ఉన్న కాన్వే 10 పరుగులు, ఉర్విల్ పటేల్ (0)లను వరుస బంతుల్లో ఔట్ అయ్యారు. ఆఖరికి అశ్విన్ 13 పరుగులు, జడేజా 1 పరుగు చేసి ఎంతోసేపు నిలవలేకపోయారు. ఇలా మొత్తంగా నిర్దేశించిన 20 ఓవర్లలో 8 వికెట్లకు 187 పరుగులు చేసింది.
ఛేజింగ్కు వచ్చిన ఆర్ఆర్ ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ మొదటి నుంచి దూకుడుగా ఆడారు. వరుస ఫోర్లు, సిక్సర్లతో చెలరేగారు. వైభవ్ 27 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. ఇలా 188 పరుగుల లక్ష్యాన్ని 17.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.