హైదరాబాద్ ఘన విజయం.. ఆర్సీబీ చిత్తు చిత్తు

శుక్రవారం (మే 23) లక్నోలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 231/6 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 94 పరుగులతో చెలరేగిపోయాడు.

దీంతో ఛేజింగ్‌కు దిగిన RCB మొదటి నుంచే తడబడింది. దాని కారణంగా మ్యాచ్‌లో ఓడిపోయింది. ఆర్‌సిబి 189 పరుగులకు ఆలౌట్ అయి 42 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో RCB టాప్-2 కి చేరుకోవాలనే ఆశలకు దెబ్బ తగిలింది.

ఈ మ్యాచ్‌లో RCB రెగ్యులర్ కెప్టెన్ రజత్ పాటిదార్ స్థానంలో వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ జితేష్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. జట్టు రెగ్యులర్ కెప్టెన్ రజత్ పాటిదార్ పూర్తిగా ఫిట్ గా లేకపోవడంతో అతడు బ్యాటింగ్ మాత్రమే చేయగలడు. ఫీల్డింగ్ చేయలేకపోవడంతో అతన్ని ప్రత్యామ్నాయ ఆటగాళ్ల జాబితాలో చేర్చారు. మ్యాచ్ తర్వాత జితేష్ శర్మ జట్టు ప్రదర్శన గురించి మాట్లాడారు. తన జట్టు దాదాపు 20-30 అదనపు పరుగులు ఇచ్చిందని, ప్రారంభంలో ఆశించిన వేగాన్ని చూపించలేదని అతను అంగీకరించాడు.

తాము 20-30 పరుగులు ఎక్కువగా ఇచ్చామని తాను అనుకుంటున్నట్లు తెలిపాడు. వారు అద్భుతంగా బ్యాటింగ్ చేశారని తెలిపారు. వారి దాడికి తన దగ్గర సమాధానం లేదని చెప్పాడు. ప్రారంభంలో తమ తీవ్రత కనిపించలేదని తెలిపాడు. జితేష్ జట్టు బౌలింగ్‌ను ప్రశంసించాడు. డెత్ ఓవర్లలో జట్టు అద్భుతంగా బౌలింగ్ చేసిందని చెప్పాడు.

మ్యాచ్ తర్వాత జితేష్ చెప్పిన విషయం ప్రస్తుతం వైరల్‌గా మారింది. జితేష్ ఈ ఓటమిని ఒక ముఖ్యమైన పాఠంగా తీసుకున్నట్లు చెప్పాడు. కొన్నిసార్లు మ్యాచ్ ఓడిపోవడం కూడా మంచి సంకేతమన్నాడు. ఎందుకంటే అలా జరగడం వల్ల లోపాలను విశ్లేషించవచ్చన్నారు. మంచి విషయం ఏమిటంటే ఆటగాళ్లందరూ సహకరిస్తున్నారన్నారు. ఈ ఓటమి తర్వాత మనకు మళ్ళీ విషయాలను సమీక్షించే అవకాశం లభించింని తెలిపాడు.

RCB మ్యాచ్‌లో ఎలా ఓడిపోయింది:

ఈ మ్యాచ్‌లో ఒక దశలో RCBకి 36 బంతుల్లో 69 పరుగులు అవసరం. చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. కానీ SRH తర్వాతి 35 బంతుల్లో 26 పరుగులకు ఏడు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పింది. నితీష్ రెడ్డి, ఇషాన్ మలింగ అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ ను మలుపు తిప్పారు.

టిమ్ డేవిడ్ గాయం

ఈ మ్యాచ్ సమయంలో టిమ్ డేవిడ్ తొడ కండరాల గాయంతో బాధపడ్డాడు. దీని గురించి జితేష్‌ను అడిగినప్పుడు తన ఇన్నింగ్స్‌తో తాను నిరాశ చెందానని.. అందుకే ఇప్పటివరకు డేవిడ్ (టిమ్)ను కలవలేకపోయానని చెప్పాడు.

తరవాత కథనం