ఐపీఎల్ 18వ సీజన్ ముగింపు దశకు వచ్చేసింది. ఇవాల్టితో ఈ సీజన్ ముగియనుంది. నేడే తుది సమరం జరగనుంది. ఐపీఎల్ 2025 సీజన్ ట్రోఫీ ఎవరు గెలుచుకుంటారో ఈరోజు రాత్రి తేలిపోనుంది. గత నెలన్నర రోజుల నుంచి దాదాపు పది జట్లు మ్యాచ్లు ఆడుతున్నాయి. చివరగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఫైనల్కు చేరుకున్నాయి.
ఈ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రియులు, అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రెండు జట్లు ఇప్పటివరకు ట్రోఫీ గెలవకపోవడంతో ఇరుజట్ల ఫ్యాన్స్ ఏం జరుగుతుందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఆర్సిబి 3 సార్లు ఫైనల్ కు వచ్చి కప్పు గెలవలేకపోయింది. ఇక పంజాబ్ మాత్రం ఫైనల్ కు ఒకసారి వచ్చింది. అందువల్ల ఈసారి ఈ రెండు జట్లలో ఎవరు టైటిల్ గెలిచిన అది ఐపీఎల్ కు మరో కొత్త ఛాంపియన్ గానే నిలుస్తారు.
అయితే ఇరుజోట్లు తలపడి మ్యాచ్ గెలిచి టైటిల్ను సాధిస్తే ఓకే. కానీ వర్షం కారణంగా రన్ రేట్ బట్టి టైటిల్ను ప్రకటిస్తారని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఈ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లో జరుగుతుంది. అక్కడ వర్షం పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ వర్షం పడితే పంజాబ్ కింగ్స్ కి టైటిల్ దక్కే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. వర్షం పెద్దగా పడకపోతే కాస్త లేట్ అయినా మ్యాచ్ నిర్వహిస్తారు.
ఒకవేళ వర్షం చాలా పెద్దదిగా మారితే మ్యాచ్ను మరుసటి రోజుకు మారుస్తారు. ఇక ఆ రోజు కూడా మ్యాచ్ జరగడానికి వీలు లేకుండా వర్షం పడితే కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహిస్తారు. అది కూడా వీలుపడలేదు అంటే రన్ రేట్ ఆధారంగా పంజాబ్ కింగ్స్ ను విజేతగా అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ జట్టు లీగ్ దశ నుంచి టాప్ లో ఉంది.