ys jagan: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది: జగన్ ఫైర్

ఏపీలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ మరింత దిగజారిపోయిందని ఆయన ఫైర్ అయ్యారు. ఇందుకు తెనాలిలో జరిగిన అమానవీయ ఘటనే నిదర్శనమని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తెనాలిలో పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుల కుటుంబాలను మాజీ సీఎం జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గుంటూరులోని తెనాలిలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో చంద్రబాబు.. టీడీపీ రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని తెచ్చి పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.. గొంతు ఎత్తినా వారిని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యంగానికి పోలీస్‌ వ్యవస్థ అదుపు తప్పిందని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అందుకు తెనాలిలో జరిగిన అమానవీయ ఘటనే నిదర్శనమని జగన్ ఆరోపించారు. రోజు రోజుకూ రాష్ట్రంలో భయానక పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు.

కూటమి ప్రభుత్వం సీఐలు, డిఎస్పీలను కలెక్షన్ ఏజెంట్లుగా వాడుకుంటుందని ఆరోపించారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలు దగ్గరుండి మరీ పోలీసులతో మామూళ్లు వసూలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే కేసులున్న ఎవరైనా ముద్దాయిలు కాలేరని అన్నారు. వారి కుటుంబాల పరువు తీసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు.

తరవాత కథనం