bangalore stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. ఆర్‌సిబి మార్కెటింగ్ హెడ్ అరెస్ట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో RCB (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) జట్టు మొదటిసారి ఛాంపియన్‌గా నిలిచింది. జూన్ 3న పంజాబ్ కింగ్స్ (PBKS)ను 6 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయం తర్వాత బెంగళూరులో విజయ పరేడ్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి లక్షల మంది రావడంతో తొక్కిసలాట జరిగింది.

ఈ ప్రమాదంలో 11 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. అనంతరం జూన్ 5న కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో 11 మంది మృతి చెందడం, అనేక మంది గాయపడటం వంటి సంఘటనలకు సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), DNA ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ (ఈ ఈవెంట్ నిర్వాహక సంస్థ), కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA), మరికొందరి వ్యక్తులపై FIR నమోదు చేయబడింది. తరువాత జూన్ 5న హైకోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని జూన్ 10 నాటికి మొత్తం విషయంపై నివేదికను కోరింది.

ఈ తరుణంలో జూన్ 6న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోస్లేను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో RCB విజయోత్సవ పరేడ్‌కు ముందు జరిగిన తొక్కిసలాట కేసులో పోలీసులు చేసిన మొదటి అరెస్టు ఇది. ఆ తర్వాత DNA సిబ్బంది ముగ్గురు సభ్యులు.. కిరణ్, సుమంత్, సునీల్ మాథ్యూలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విజయ పరేడ్ కార్యక్రమాన్ని సరిగ్గా ప్లాన్ చేయలేదని నిఖిల్ సోసలేపై ఆరోపణలు ఉన్నాయి. దీని కారణంగా పరిస్థితి అదుపు తప్పింది. అతనితో పాటు, ఒక ఈవెంట్ కంపెనీ DNA కి చెందిన ముగ్గురు ఉద్యోగులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ విషాద ప్రమాదానికి ఎవరి నిర్లక్ష్యం కారణమో తెలుసుకోవడానికి పోలీసులు ఇప్పుడు ఈ విషయాన్ని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

నిఖిల్ సోసలే ముంబైకి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా.. విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఈ గందరగోళంలో అతని పాత్ర ఎంత తీవ్రంగా ఉందో తెలుసుకోవడానికి నిఖిల్‌ను విచారిస్తున్నారు.

తరవాత కథనం