aamir khan: అమీర్, లోకేష్ కొత్త సినిమా షురూ.. షూటింగ్ టైం ఫిక్స్!

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తన కొత్త చిత్రం ‘సితారే జమీన్ పర్’ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి ముందు ఆమిర్ ఖాన్ తన అభిమానులకు మరో శుభవార్త అందించాడు. ఈ అప్డేట్‌తో వారి ఉత్సాహం మరింత పెరిగింది. తమిళ సూపర్ హిట్ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో అతి త్వరలోనే మరొక కొత్త సినిమా చేయబోతున్నట్లు ఆమిర్ ప్రకటించాడు.

ఆమిర్ ఖాన్, లోకేష్ కనగరాజ్

ఇటీవల ఒక మీడియా సమావేశంలో ఆమీర్ ఖాన్ తన ‘సితారే జమీన్ పర్’ చిత్రంతో పాటు రాబోయే తన ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. త్వరలో లోకేష్ కనగరాజ్‌తో ఒక కొత్త సినిమా చేయబోతున్నానని.. షూటింగ్ నెక్స్ట్ ఇయర్ ప్రారంభం అవుతుందని తెలిపారు. ఇది ఒక యాక్షన్ సినిమా అని వెల్లడించాడు. దీంతోపాటు రాజ్ కుమార్ హిరానీతో రాబోయే బయోపిక్ గురించి కూడా వ్యాఖ్యానించారు.

తన రాబోయే ప్రాజెక్టుల గురించి అమీర్ మాట్లాడుతూ.. ‘పీకే 2’ కి సంబంధించిన వార్తలన్నీ పుకార్లే. దాని గురించి తనకు ఏమీ తెలియదు అన్నాడు. అదే సమయంలో తాము ఖచ్చితంగా దాదాసాహెబ్ ఫాల్కేపై బయోపిక్ తీస్తున్నాము అని తెలిపారు. రాజ్, నేను దానిపై పని చేస్తున్నాము అని వెల్లడించాడు. దీనితో పాటు తాను, లోకేష్ కనగరాజ్ ఒక సినిమా కోసం పని చేస్తున్నాము అని పేర్కొన్నాడు. దీని కథ సూపర్ హీరో జానర్‌లో ఉంటుందన్నారు. ఇది ఒక పెద్ద యాక్షన్ చిత్రం అని.. దీని షూటింగ్ వచ్చే ఏడాది 2026 ద్వితీయార్థంలో ప్రారంభమవుతుందని తెలిపాడు. ప్రస్తుతానికి తాను దీని కంటే ఎక్కువ ఏమీ చెప్పలేనని వివరించాడు.

రజనీకాంత్ ‘కూలీ’లో ఆమిర్ ఖాన్

లోకేష్ తమిళ సినిమా దర్శకులలో ఒకరు. అతడు చాలా తక్కువ సమయంలో పెద్ద సూపర్ స్టార్లతో కలిసి పనిచేశారు. దళపతి విజయ్, కమల్ హాసన్ తో ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించాయి. లోకేష్ కు తన సొంత సినిమాటిక్ విశ్వం కూడా ఉంది. అది అభిమానులకు చాలా ఇష్టం. ఇప్పుడు ఆయన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో ‘కూలీ’ సినిమా కూడా తీస్తున్నారు.

కొన్ని నివేదికల ప్రకారం.. లోకేష్ చిత్రం ‘కూలీ’లో అమీర్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. ఈ చిత్రంలో నటిస్తున్న నటుడు ఉపేంద్ర రావు సూపర్ స్టార్ అతిధి పాత్రను వెల్లడించాడు. ఒక కార్యక్రమంలో ఆయన ‘కూలీ’లో అమీర్‌తో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ చిత్రంలో లోకేష్.. అమీర్‌ను చాలా బాగా ప్రజెంట్ చేశాడని చెప్పాడు. దీంతో అది కాస్త వైరల్‌గా మారింది.

తరవాత కథనం