కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్తో కలిసి కలాం అనే మూవీ చేయబోతున్నాడు. ఈ చిత్రం నుంచి బిగ్ అప్డేట్ను మేకర్స్ తాజాగా అందించారు. అభిషేక్ అగర్వాల్, భూషణ్ కుమార్,అనిల్ సుంకర, కృష్ణన్ కుమార్ ప్రొడ్యూసర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. దీనిని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో లాంచ్ చేశారు.
మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన భారతదేశ మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్ కలాం పాత్రలో ధనుష్ నటిస్తున్నాడు. ఈ సినిమా కలాం బయోపిక్లో వస్తుంది. దీనికి మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే ట్యాగ్లైన్ పెట్టారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేయడంతో విశేష రెస్పాన్స్ వచ్చింది.
ఈ పోస్టర్లో ధనుష్.. కలాం పాత్రలో కనిపించాడు. మిస్సైల్ గాల్లోకి దూసుకెళ్లినట్లు చూపించారు. తన్హాజీ, ఆదిపురుష్ లాంటి బడా బడ్జెట్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఓం రౌత్ ఈ ప్రతిష్టాత్మక సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అబ్దుల్ కలాం జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను ఇందులో చూపించబోతున్నారు.
దీంతో ఇండియన్ సినిమాలో విలక్షణ నటుడిగా పేరుగాంచిన ధనుష్.. కలాం పాత్ర పోషించనుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు ఎన్నో డిఫరెంట్ పాత్రలు చేసిన ధనుష్ ఇప్పుడు కలాం పాత్రలో తన నటన ఎలా ఉంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.