టాలీవుడ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని ఒక మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుస సినిమాలు తీస్తున్నాడు. కానీ ఏ సినిమా కూడా అతడికి మంచి కంబ్యాక్ ఇవ్వడం లేదు. గతంలో స్కంద మూవీ భారీ బడ్జెట్తో వచ్చింది. బోయపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత డబుల్ ఇస్మార్ట్ తో మరో చిత్రం తీశాడు.
పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం కూడా బెడిసి కొట్టింది. దీంతో తన తదుపరి చిత్రాలపై రామ్ పోతినేని బాగా ఫోకస్ పెట్టాడు. ఒక మంచి కథ కోసం ఎదురు చూస్తుండగా.. “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” ఫెమ్ దర్శకుడు పి మహేష్ బాబు అదిరిపోయే స్టోరీని రామ్ పోతినేనికి వివరించాడు. దీనికి అతడు ఓకే చెప్పేసాడు. ఇప్పుడు ఆ సినిమా పట్టాలెక్కేసింది.
షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో రామ్ పోతినేనికి జంటగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతోంది. బడా నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రామ్ పోతునేని కెరియర్ లో 22వది. ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు.
ఈ నేపథ్యంలో మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. మే 15వ తేదీన రామ్ పోతినేని బర్త్డే కానుకగా సర్ప్రైజ్ అందించారు. ఇందులో భాగంగా ఈ మూవీ నుంచి టైటిల్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి “ఆంధ్ర కింగ్ తాలూకా” అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈ మేరకు గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రామ్.. సాగర్ అనే క్యారెక్టర్ లో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఫ్యాన్ గా కనిపించబోతున్నాడు.
ఈ టైటిల్ గ్లిoప్స్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఉపేంద్ర సినిమా రిలీజ్ కు రామ్ పోతినేని చేసే హంగామా ఓ రేంజ్ లో చూపించారు. దీనికి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. మనసును హత్తుకునే కథాంశంతో ఫ్యామిలీ, యూత్, ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కుతోంది. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.