tamil hero vishal: స్టేజ్‌పైనే కుప్పకూలిపోయిన విశాల్.. వైద్యులు ఏం చెప్పారంటే?

కోలీవుడ్ హీరో విశాల్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎప్పటికప్పుడే ఆయన అనారోగ్యంతో హాస్పిటల్ పాలు అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి స్టేజి పైన కుప్పకూలిపోయాడు. తమిళనాడులోని ఓ ప్రోగ్రాం కు హాజరైన హీరో విశాల్.. స్టేజ్ పైనే మాట్లాడుతూ ఒకసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతడిని హాస్పిటల్ కి తరలించారు.

అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడు విల్లుపురం లోనీ కోవగం కూతండావర్ టెంపుల్ ఫెస్టివల్ జరిగింది. ఈ సందర్భంగా సౌత్ ఇండియా ట్రాన్స్ జెండర్స్ ఫెడరేషన్ తరఫున ఒక పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి హీరో విశాల్, మాజీ మంత్రి పొన్ముడి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో అందరూ బాగా సందడి చేశారు. ఇందులో భాగంగానే వేదికపై మాట్లాడి ఫోటోలు ఇస్తున్న సమయంలో విశాల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న వారిపై స్పృహతప్పి పడిపోయాడు. దీంతో వేదికపై ఉన్నవారు గమనించి విశాల్‌ను ఒక్కసారిగా పైకిలేపి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. తాజాగా విశాల్ హెల్త్ అప్డేట్ వచ్చింది.

అతడు ఆహారం తీసుకోకపోవడంతోనే ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు. భోజనం చేయకపోవడంతో విశాల్ నీరసం ఐపోయాడని.. అందువల్లనే స్పృహ తప్పి పడిపోయాడని వివరించారు. ప్రస్తుతం విశాల్ ఆరోగ్యం బాగానే ఉందని.. అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

తరవాత కథనం