భారత దేశ సరిహద్దు ప్రాంతాల్లో మళ్లీ మాక్ డ్రిల్ను నిర్వహించారు. హోం మంత్రిత్వ శాఖ (MHA) ఆదేశాల మేరకు జమ్మూ & కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా, చండీగఢ్లలో ఈరోజు ‘ఆపరేషన్ షీల్డ్’ అనే పౌర రక్షణ విన్యాసాలు జరిగాయి. యుద్ధం లేదా విపత్తు సంభవించినప్పుడు పౌర రక్షణ సంసిద్ధతను పరీక్షించడానికి ఈ మాక్ డ్రిల్లను నిర్వహిస్తారు. మాక్ డ్రిల్ కింద సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, స్థానిక పరిపాలన సిబ్బంది, NCC, NSS, NYKS,భారత్ స్కౌట్స్, గైడ్స్ వంటి యువ వాలంటీర్లను వివిధ పనులలో పౌర పరిపాలనకు సహాయం చేయడానికి వారి సేవల కోసం పిలిచారు.
జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లోని డిసి కార్యాలయం వెలుపల మాక్ డ్రిల్ నిర్వహించారు. అదే సమయంలో పంజాబ్లోని అమృత్సర్లో కూడా మాక్ డ్రిల్ నిర్వహించారు. అన్ని పౌర రక్షణ విభాగాలు ఒకదానితో ఒకటి ఎలా సమన్వయం చేసుకుంటాయో సమీక్షించడమే ఈ మాక్ డ్రిల్ లక్ష్యం అని అమృత్సర్ కమాండెంట్ జస్కరన్ సింగ్ అన్నారు.
పాకిస్తాన్తో సరిహద్దులలో ఉన్న చాలా జిల్లాలు ఎక్కువ ప్రమాదంలో ఉన్నాయి. అమృత్సర్, పఠాన్కోట్, తర్న్ తరణ్, గురుదాస్పూర్, ఫిరోజ్పూర్, ఫాజిల్కా లలో యుద్ధం లాంటి పరిస్థితిలో పనిచేసేలా చూసుకోవడమే ఈ మాక్ డ్రిల్ల లక్ష్యం. అలాగే, వైమానిక దాడులు, డ్రోన్ దాడుల సమయంలో ఇంట్లో ఎలా సురక్షితంగా ఉండాలో ఇందులో వివరిస్తారు. బ్లాక్అవుట్ సమయంలో మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి అనేది ఈ ఆపరేషన్ షీల్డ్లో చెప్తారు.
వైమానిక, డ్రోన్ దాడి సమయంలో
మాక్ డ్రిల్ సమయంలో శత్రు విమానాలు, డ్రోన్లు, క్షిపణి దాడుల పరిస్థితిని చిత్రీకరించారు. ఒకవేళ శత్రువులు వేసే బాంబులకు ఎలా రక్షించుకోవాలి. ఆ బాంబుల బారి నుంచి ఇంతరులను ఎలా కాపాడాలి అనే అనేక విషయాల గురించి వివరించారు.