operation sindoor: పాకిస్థాన్​ మిరాజ్​ యుద్ద విమానం కూల్చేశాం.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన!

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకగా భారత్ ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్, పిఓకే లోనీ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. దాదాపు 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి వంద మందికి పైగా టెర్రరిస్టులను హతమార్చింది. అనంతరం పాక్.. భారత్ లోనీ సరిహద్దు ప్రాంతాలైన జమ్ము, పంజాబ్, రాజస్థాన్ లపై దాడులకు ప్రయత్నించింది.

కానీ ఇండియన్ ఆర్మీ పాక్ దాడులను తిప్పుకొట్టింది. పాక్ ఉపయోగించిన డ్రోన్ బాంబులు, క్షిపణులను గాల్లోనే ధ్వంసం చేసింది. అయితే ఈ యుద్ధం రీసెంట్గా ముగిసింది. ఇది దేశాలు పాల్పుల విరమణ పొందాయి. అనంతరం ఇండియన్ ఆర్మీ విలేఖరు సమావేశం నిర్వహించింది. భారత్ అండ్ పాక్ కాల్పుల విరమణ నేపథ్యంలో నేవీ, ఆర్మీ, వాయిస్ సెనలకు సంబంధించిన ఉన్నతాధికారులు ప్రెస్ బ్రీఫింగ్ లో అనేక సంచలన విషయాలు వెల్లడించారు.

ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ కు చెందిన మిరాజ్ యుద్ధ విమానాన్ని కూల్చేసినట్టు ఇండియన్ ఆర్మీ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ఒక వీడియోని రిలీజ్ చేసింది. అందులో పాకిస్తాన్ కు చెందిన మిరాజ్ శకలాలు కనిపించాయి. పాక్ లోని కరాచీకి సమీపంలో ఉన్న టార్గెట్స్ పై దాడులు నిర్వహించినట్లు తెలిపారు.

అది మాత్రమే కాకుండా పాకిస్తాన్ పంజాబ్ లోని రహీమ్ యార్ ఖాన్ వాయు స్థావరం పై కూడా దాడి చేశామని దాని ఫలితంగా రన్వేపై పెద్ద గుంట ఏర్పడినట్టు పేర్కొన్నారు. అలాగే కనీర్ బేస్ పై కూడా దాడులు చేశామని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన వాళ్ళు వీడియోలను పంచుకున్నారు. ప్రస్తుతం అవి నెట్టెంట వైరల్ గా మారాయి.

తరవాత కథనం