ఐపీఎల్ 18లో భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య రసవత్రమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు ఘన విజయం సాధించింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఐపీఎల్ లో పంజాబ్ కింగ్ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. అదే సమయంలో నేరుగా క్వాలిఫైడ్ ఆడే ఛాన్స్ కొట్టేసింది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో ఇంగ్లీష్, ప్రియంస్ ఆర్య మెరుపులతో ముంబై ఇండియన్స్ ను మట్టి గరిపించారు. దీంతో 19 పాయింట్లుతో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. అదే సమయంలో ముంబై ఇండియన్స్ 16.లతో నాలుగు స్థానంలో నిలిచిపోయింది.
మొదట టాస్ ఓడి ముంబై ఇండియన్స్ బ్యాటింగ్కు దిగింది. మొదటినుంచి మంచి ఫామ్ కనబరిచింది. కానీ ఓపెనర్ లో రోహిత్ శర్మ, రికిల్టన్ పెద్దగా పరుగులు రాబట్టలేదు. ఆ తర్వాత వచ్చిన సూర్య కుమార్ యాదవ్ పరుగులు వరదరాబెట్టాడు. రికిల్టన్ 27 పరుగులు, రోహిత్ శర్మ 24 పరుగులు, తిలక్ వర్మ 1 పరుగు, జాక్స్ 17 పరుగులు, నమన్ దీర్ 20 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ హౌఫ్ సెంచరీ తో చెలరేగాడు. 39 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఇలా ముంబై జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
దీంతో 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు త్వరగా ముగించేసిందే. చేతనలో ప్రియంస్, ఇంగ్లీష్ లే హీరోలుగా నిలిచారు. ఇద్దరూ మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో 18.3 ఓవర్లకే పంజాబ్ జట్టు ఘన విజయం సాధించింది. కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రబ్ సిమ్రాన్ 13 పరుగులు, జోష్ ఇంగ్లీష్ 73 పరుగులు, ప్రియామ్స్ ఆర్య 62 పరుగులతో చెలరేగిపోయారు. శ్రేయస్ అయ్యర్ 26 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. వధేరా 2 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు.