rapper drake: ఆర్సీబీపై రూ.6కోట్లకు పైగా బెట్ వేసిన టాప్ సింగర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్ మ్యాచ్ కు ముందు హాలీవుడ్ ప్రముఖ రాపర్ డ్రేక్ విరాట్ కోహ్లీ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మెగా పందెం వేశాడు. ఇవాళ గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ మ్యాచ్ గురించి అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు దాని ప్రభావం విదేశాలకు చేరినట్లు కనిపిస్తోంది.

‘కికీ డు యు లవ్ మీ’ పాట పాడిన డ్రేక్ కు ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానులు ఉన్నారు. అతను కూడా ఐపీఎల్ 2025 పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. డ్రేక్ స్వయంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను షేర్ చేశాడు. అందులో అతడు ఆర్‌సిబికి మద్దతు ఇచ్చాడు. కింగ్ కోహ్లీ జట్టుపై డ్రేక్ సుమారు $750,000 అంటే రూ.6 కోట్ల 43 లక్షల పందెం వేసినట్లు పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఇందులో అతనికి లాభం వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో పంజాబీ రాపర్ కరణ్ ఆజ్లా పంజాబ్ కింగ్స్ పై $500,000 అంటే దాదాపు రూ.4 కోట్ల 29 లక్షల పందెం వేశాడు.

డ్రేక్‌కి మొదటిసారి కాదు

డ్రేక్ ఒక పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ లేదా ఆటగాడిపై పందెం వేయడం ఇదే మొదటిసారి కాదు. అతను ఇంతకు ముందు కూడా ఇలాగే చేశాడు. రాపర్ డ్రేక్ పందెం వేసే ఏ హై ప్రొఫైల్ అథ్లెట్ లేదా జట్టు ఓడిపోతుందని నెటిజన్లు అంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అదే జరుగుతుంది. సెరెనా విలియమ్స్ నుండి కోనర్ మెక్‌గ్రెగర్ వరకు.. PSG నుండి టొరంటో రాప్టర్స్ వరకు అందరూ డ్రేక్‌తో ఫోటోలు, వీడియోలలో కనిపించిన తర్వాత అకస్మాత్తుగా ఓడిపోవడం గమనార్హం. దీంతో అభిమానుల్లో కాస్తంత ఆందోళన కనిపిస్తుంది.

తరవాత కథనం