టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తమ అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చాడు. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు టెస్ట్ ఫార్మేట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో క్రికెట్ ఫ్యాన్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇటీవలే రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు గుడ్ బాయ్ చెప్పేసాడు. అతడి బాటలోనే ఇప్పుడు విరాట్ టెస్టులకు వీడ్కోలు పలికాడు.
ఈ మేరకు విరాట్ తన ఇన్స్టా లో ఒక భావోద్వేగా పోస్ట్ పెట్టాడు. 14 ఏళ్ల క్రితం తొలిసారిగా టెస్ట్ క్రికెట్ జెర్సీ ధరించానని అన్నాడు. ఈ ఫార్మేట్ తనను ఇంత దూరం తీసుకెళుతుందని తాను ఎప్పుడు అనుకోలేదని తెలిపాడు. ఈ టెస్ట్ ఫార్మేట్ తనను ఎంతో పరీక్షించిందని.. తీర్చిదిద్దిందని.. జీవితానికి సరిపడా పాఠాలు నేర్పించిందని అన్నాడు.
ముఖ్యంగా తెల్ల జెర్సీలో ఆడటం వ్యక్తిగతంగా తన మనసుకు చాలా ప్రత్యేకమైనదని చెప్పుకొచ్చాడు. ఈ టెస్ట్ ఫార్మేట్ నుంచి దూరం కావడం అంత తేలిక విషయం కాదనీ.. కానీ తన నిర్ణయం సరైనదేనని తనకు అనిపించినట్లు తెలిపాడు. ఈ ఫార్మేట్ కోసం తాను ఎంతో ఇచ్చానని.. దానికి తాను ఆశించిన దానికంటే ఎక్కువే అది తనకు తిరిగిచ్చిందని వివరించాడు.
మనసునిండా సంతృప్తితో ఈ ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నాను అన్నాడు. ప్రేమతో ఇక సైనింగ్ ఆఫ్ అని తన పోస్ట్ లో రాసుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే విరాట్ గతేడాది టి20 ఫార్మేట్ కు వీడ్కోలు పలికాడు. టి20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రోహిత్, విరాట్ కలిసి ఒకేసారి పొట్టి క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఇక 2011లో కోహ్లీ టెస్ట్ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. ఇప్పటివరకు విరాట్ 123 టెస్టులు ఆడి 9230 పరుగులు చేశాడు. అందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.