ఇండియా vs ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్లో మొదటి మ్యాచ్ లీడ్స్లోని హెడింగ్లీ క్రికెట్ గ్రౌండ్లో జరిగింది. మొదటి మ్యాచ్లో ఇంగ్లాండ్ అద్భుతంగా రాణించి 5 వికెట్ల తేడాతో మ్యాచ్ను గెలుచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ 5 సెంచరీలు చేసింది. అయినప్పటికీ టీమ్ ఇండియా మ్యాచ్ గెలవలేకపోయింది. కెప్టెన్ శుభ్మాన్ గిల్ నాయకత్వంలో భారత్ తొలి మ్యాచ్లో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో భారత జట్టు బౌలింగ్, ఫీల్డింగ్ చాలా నిరాశపరిచింది. దీని కారణంగా భారత జట్టు 0-1తో వెనుకబడింది.
ఇండియా బ్యాటింగ్
తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు 113 ఓవర్లలో 471 పరుగుల భారీ స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 159 బంతుల్లో 101 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా, శుభ్మాన్ గిల్ కూడా 147 పరుగులు చేశాడు. దీనికి తోడు, రిషబ్ పంత్ కూడా 134 పరుగులు చేశాడు. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ బ్యాటర్లు ఓలీ పోప్ 106, హ్యారీ బ్రూక్ 99 పరుగులతో 100.4 ఓవర్లలో 465 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో భారత్కు 6 పరుగుల ఆధిక్యం లభించింది. జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు.
రెండో ఇన్నింగ్స్లో కెఎల్ రాహుల్ 137, రిషబ్ పంత్ 118 పరుగులతో రాణించడంతో భారత్ 96 ఓవర్లలో 364 పరుగులు చేసింది. 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ ఐదవ రోజు ఆట ముగిసేలోపు 82 ఓవర్లలో 373/5 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో మ్యాచ్ను గెలుచుకుంది.
భారత జట్టు పేలవమైన ఫీల్డింగ్
ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ 4 క్యాచ్లను వదులుకున్నాడు. భారత్ జట్టు చాలా సందర్భాలలో పేలవమైన ఫీల్డింగ్ చేసింది. బౌలింగ్లో కూడా భారత జట్టు చాలా ఇబ్బంది పడింది. రెండో ఇన్నింగ్స్లో భారత బౌలర్లు ఇంగ్లాండ్కు ప్రారంభ షాక్లు ఇవ్వడంలో విఫలమయ్యారు. రెండో ఇన్నింగ్స్లో మొదటి వికెట్కు 188 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా ఇంగ్లాండ్ భారత జట్టును ఓడించింది.






