ఇంగ్లాండ్పై భారత జట్టు అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. కానీ టీమ్ ఇండియా గెలవలేకపోయింది. ఇంగ్లాండ్ భారత్ను 5 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు భారత జట్టు దృష్టి రెండో టెస్ట్ మ్యాచ్పై ఉంది. జూన్ 2 నుండి రెండో మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హాడెన్ శుభ్మన్ గిల్కు సలహా ఇచ్చారు. గిల్ తన వైఖరిని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.
తొలి మ్యాచ్లో భారత జట్టు బౌలింగ్ వైఫల్యం కారణంగా ఓడిపోయింది. అలాగే ఫీల్డింగ్ కూడా పేలవంగా ఉండటం వల్ల ఓటమికి దారితీసింది. భారత జట్టు చాలా సందర్భాలలో సులభమైన క్యాచ్లను వదిలివేసింది. యశస్వి జైస్వాల్ స్వయంగా 4 క్యాచ్లను వదిలివేసాడు. దీంతో ఇప్పుడు భారత పేలవమైన ఫీల్డింగ్ గురించి ఆయన మాట్లాడుతూ.. శుభ్మాన్ గిల్ను హెచ్చరించాడు. ప్రతి గొప్ప జట్టు వారి ప్రత్యేకతలలో ఒకటి వారు గొప్ప ఫీల్డింగ్ జట్టుగా ఉండటం అని ఆయన అన్నారు. గిల్ ఇప్పుడు ఈ జట్టులో దాన్ని వదిలివేయడం ప్రారంభించాడని తాను భావిస్తున్నాను అని తెలిపాడు.
వాళ్ళు తమ వైఖరిని మార్చుకోవాలి. మీరు బాగా ఫీల్డింగ్ చేయాలనుకున్నా.. ఎల్లప్పుడూ పోటీ పడాలనుకున్నా అది వైఖరి గురించి మాత్రమే. మైదానం వెలుపల మీ సాంకేతిక పనులన్నీ చేయవచ్చు అన్నారు. ఈ సంవత్సరం IPLలో కూడా క్యాచింగ్ చాలా పేలవంగా ఉంది. ఇది దాని ఫలితం కావచ్చు అని అభిప్రాయపడ్డాడు.
రెండో మ్యాచ్ పై భారత్ దృష్టి
ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భారత జట్టు 1-0తో వెనుకబడి ఉంది. రెండవ మ్యాచ్ జూలై 2 నుండి ఎడ్జ్బాస్టన్లో జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని భారత జట్టు కోరుకుంటుంది. కానీ జట్టు మూడు విభాగాల్లోనూ బాగా రాణించాల్సి ఉంటుంది. ఏదైనా ఒక విభాగంలో పేలవమైన ప్రదర్శన టీమ్ ఇండియాకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది.






