ఎడ్జ్బాస్టన్లో జరిగిన రెండో టెస్ట్లో టీమ్ ఇండియా తన పట్టును మరింత బలోపేతం చేసుకుంది. మూడో రోజు మొహమ్మద్ సిరాజ్ తన బౌలింగ్తో విధ్వంసం సృష్టించాడు. జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో సిరాజ్ ఈసారి బాధ్యతను తన బుజాలపై వేసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సిరాజ్ 6 వికెట్లు తీసుకున్నాడు. దీంతో 6 వికెట్లు పడగొట్టడం ద్వారా.. మొహమ్మద్ సిరాజ్ ఎడ్జ్బాస్టన్లో చరిత్ర సృష్టించాడు.
32 సంవత్సరాల తర్వాత ఎడ్జ్బాస్టన్లో ఘనత
ఎడ్జ్బాస్టన్ టెస్ట్ నుంచి టీం ఇండియా ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు. ఆ తర్వాత ఈ మ్యాచ్లో అందరి ఆశలు మహ్మద్ సిరాజ్పైనే ఉన్నాయి. సిరాజ్ తొలి ఇన్నింగ్స్లో అందరి అంచనాలకు తగ్గట్టుగానే రాణించాడు. తొలి ఇన్నింగ్స్లో అతను అద్భుతంగా బౌలింగ్ చేసి 6 వికెట్లు పడగొట్టాడు. 1993 తర్వాత ఒక పర్యాటక జట్టు నుంచి ఒక బౌలర్ ఎడ్జ్బాస్టన్ మైదానంలో 6 వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి. దీనితో పాటు ఎడ్జ్బాస్టన్లో 5 వికెట్లు తీసిన ఐదవ బౌలర్గా సిరాజ్ నిలిచాడు. తొలి ఇన్నింగ్స్లో జాక్ క్రౌలీ, జో రూట్, బెన్ స్టోక్స్, బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్లను ఔట్ చేశాడు.
ఇంగ్లాండ్ 407 పరుగులకు ఆలౌట్ అయింది.
తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు మూడో రోజు 407 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ 84 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది. కానీ ఆ తర్వాత హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారత బౌలర్లకు చెమటలు పట్టించారు. ఈ ఇద్దరు బ్యాట్స్మెన్స్ కూడా సెంచరీలు సాధించారు. దీనితో పాటు ఆరో వికెట్కు బ్రూక్, స్మిత్ మధ్య 303 పరుగుల భాగస్వామ్యం ఉంది. దీని కారణంగా ఇంగ్లాండ్ జట్టు 400 పరుగుల మార్కును దాటగలిగింది.
తొలి ఇన్నింగ్స్లో జేమీ స్మిత్ 184 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. హ్యారీ బ్రూక్ 158 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ లో మొహమ్మద్ సిరాజ్ కాకుండా.. ఆకాష్ దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆకాష్ దీప్ మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్లు పడగొట్టాడు. అందులో రెండవ రోజు ఒకే ఓవర్లో 2 వికెట్లు పడగొట్టాడు.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీం ఇండియా 1 వికెట్ కోల్పోయి 64 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 28 పరుగులు చేసి ఔటవడం ద్వారా టీం ఇండియాకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం భారత జట్టు 244 పరుగుల ఆధిక్యంలో ఉంది.






